Friday, May 10, 2024

క్వార్ట‌ర్స్ లో సాత్విక్‌-చిరాగ్ ఓట‌మి.. వెనుదిరిగిన భార‌త ద్వ‌యం

BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ పురుషుల డ‌బుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జంట క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడి టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. డెన్మార్క్‌కు చెందిన అండర్స్ స్కారప్ రాస్ముస్సేన్-కిమ్ ఆస్ట్రప్ ద్వయం 21-18, 21-19తో మ్యాచ్‌ను చేజిక్కించుకుని భారత ద్వయాన్ని ఓడించింది. రెండు గేమ్‌ల్లోనూ భారత్ మంచి పునరాగమనం చేసినా ఓటమితో వెనుతిరిగింది.

ఇక ప్రస్తుతం భారత తనుపున.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో హెచ్‌ఎస్ ప్రణయ్ తన పోరును కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్హాస్ మధ్య ప్రారంభమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement