Tuesday, May 21, 2024

Sangareddy | ఎమ్మెల్యే జీఎంఆర్​ కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ నీలం మధు

పటాన్ చేరు, (ప్రభ న్యూస్): త‌న కొడుకును కోల్పోయి పుత్రశోకంలో మునిగిన ఎమ్మెల్యే జీఎంఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ప‌రామ‌ర్శించారు. శుక్రవారం వారి నివాసానికి వెళ్లి సంతాపం తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి మృతి చాలా బాధాకరమని, కుటుంబ సభ్యులతో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కొడుకు మృతి కుటుంబానికి తీరని లోటని కుటుంబంలో నెలకొన్న విషాదంపై ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని కూడా పరామర్శించారు. తన మామ మృతితో అంత్యక్రియలకు తాను హాజరు కాలేకపోయానని సంతాపాన్ని వ్యక్తం చేశారు. దుఃఖ సాగరంలో మునిగిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతితో పాటు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నాయకులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement