Wednesday, May 1, 2024

National : ప‌దేళ్ల అక్ర‌మ చెర‌నుంచి సాయిబాబా విడుద‌ల…

నాగ‌పూర్ సెంట్ర‌ల్ జైలు నుంచి ఇవాళ ఢిల్లీ వ‌ర్సిటీ మాజీ ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబాను రిలీజ్ చేశారు. మావోల‌తో లింకు ఉన్న కేసులో రెండు రోజుల క్రితం బాంబే హైకోర్టు ఆయ‌న్ను నిర్దోషిగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2017 నుంచి ప్రొఫెస‌ర్ సాయిబాబ‌.. నాగ‌పూర్ సెంట్ర‌ల్ జైలులోనే ఉంటున్నారు.

2014 నుంచి ఆయ‌న జైలులో ఉన్నారు. ఇవాళ జైలు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ త‌న ఆరోగ్యం చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని,ఇప్పుడు తానేమీ మాట్లాడ‌లేన‌ని, ముందుగా మెడిక‌ల్ ట్రీట్మెంట్ తీసుకోవాల‌ని, ఆ త‌ర్వాత తాను ఈ కేసు వివ‌రాల‌ను తెలుపుతాన‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement