Thursday, April 25, 2024

ఆజాద్‌ ఇంజినీరింగ్‌లో వాటా కొన్న సచిన్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆజాద్‌ ఇంజినిరింగ్‌లో క్రికెట్‌ లెజం డరీ సచిన్‌ టెండుల్కర్‌ వాటా కొనుగోలు చేశారు. క్లీన్‌ ఎనర్జీ, ఎయిర్‌స్పేస్‌, డిఫెన్స్‌ అండ్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగంలో ఉన్న గ్లోబల్‌ ఓఈఎంలకు ఆజాద్‌ ఇంజినీరింగ్‌ సంస్థ టెక్నాలజీ సొల్యూషన్స్‌ అందిస్తోంది.

సచిన్‌ చేసిన పెట్టుబడులుతో మేక్‌ఇన్‌ ఇండియా, ఆత్మనిర్బర్‌ భారత్‌కు కంపెనీ మరింత తోడ్పాటు అందించనుందని ఆజాద్‌ ఇంజినీరింగ్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఛోప్దార్‌ తెలిపారు. సచిన్‌ తమ సంస్థలో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా భావిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement