Tuesday, May 7, 2024

గుంటూరు కారం మూవీపై రూమర్స్​.. హీరియిన్​ని మార్చేశారని ప్రచారం

మహేష్ బాబు ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో మార్పులు చేశారన్న వార్తలు సోష‌ల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే.. ఇందులో సంగీత ద‌ర్శ‌కుడు థమన్ సినిమా నుండి త‌ప్పుకున్నారనే ఊహాగానాలను ఖండించారు మేక‌ర్స్. ఈ రూమ‌ర్స్ ఫేక్ అని తన ట్విటర్ ద్వారా వెల్ల‌డించాడు థ‌మ‌న్. అంతే కాకుండా ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నట్లు చిత్ర సహ నిర్మాత నాగవంశీ కూడా వెల్లడించారు.

కాగా, ఇవ్వాల (మంగళవారం) పూజా హెగ్డే గురించి మ‌రో కొత్త పుకారు షికారు చేయడం ప్రారంభించింది. కొన్ని రూమర్స్​ ప్రకారం, పూజా హెగ్డేను ఈ మూవీ నుంచి తొలగించారని తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీలీల ప్రధాన కథానాయికగా నటించబోతోందని, పూజాహెగ్డే ప్లేస్​లో ఆమెను తీసుకుంటున్న‌ట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, సంగీత ద‌ర్శ‌కుడిపై వ‌చ్చిన ఊహాగానాల‌కు స్పదించిన “గుంటూరు కారం” మూవీ యూనిట్.. హీరోయిన్ల విష‌యంలో మాత్రం మౌనంగానే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement