Thursday, April 18, 2024

కాంతార‌కి రూ.5కోట్లు.. సీక్వెల్ కి రూ.100కోట్లా..!

చిన్న చిత్రంగా వ‌చ్చి పెద్ద విజ‌యాన్ని అందించింది కాంతార చిత్రం. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్క‌నుంది. కాంతార‌కి రూ.5కోట్లు తీసుకున్న హీరో రిష‌బ్ శెట్టి.. సీక్వెల్ కోసం ఏకంగా రూ.100కోట్లు తీసుకోనున్నార‌ట‌. రిషబ్ శెట్టి తీసుకోనున్న పారితోషకం ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాంతార రూ.16 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే కాంతారా 2 కోసం కళ్ళు చెదిరే పారుతోషకం తీసుకోబోతున్నారని సమాచారం.రిషబ్ శెట్టి కాంతార 2 సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నారట. రూ. 50 కోట్లు పారితోషకం రూపంలో.. రూ. 50 కోట్లు బిజినెస్ లో షేర్ తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి ఆయన రేంజ్ను బట్టి, డిమాండ్ ను బట్టి, రూ.5 కోట్లు ఎక్కడ.. రూ.100 కోట్లు ఎక్కడ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మ‌రి ఈ విష‌యంపై రిష‌బ్ శెట్టి ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement