Sunday, April 28, 2024

Delhi : ఢిల్లీలో రోడ్డు ప్ర‌మాదం… ముగ్గురు మృతి…

ఢిల్లీలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కారు బైక్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

ఓ వివాహ కార్యక్రమానికి హాజరై.. అర్ధరాత్రి బైక్‌పై సోదరీమణులతో కలిసి సురేందర్ ఇంటికి తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టి వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఢిల్లీ సమీపాన ఉన్న గ్రేటర్‌ నోయిడాలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోదరుడు, అతని సోదరీమణులిద్దరూ ప్రాణాలు విడిచారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఓ పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. కారు అదుపు తప్పి వీరి బైక్‌ను ఢీకొట్టింది. సురేందర్, అతని సోదరీమణులు శైలి, అను మృతిచెందగా.. మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. నోయిడాలోని కులేసరలో నివాసం ఉంటున్నారు. సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్నా ప్రాంతంలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు వారి మీద వెళ్లినట్లు దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. బైక్‌ను ఢీకొట్టిన కారును ఇంకా గుర్తించలేదన్నారు. అలాగే ఎవర్నీ అరెస్ట్ చేయలేదని.. సీసీటీవీని పరిశీలించాక ముందుకు వెళ్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement