Sunday, May 5, 2024

మళ్ళీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

దేశంలో కరుణ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న చమురు ధరలు మాత్రం తగ్గుముఖం పట్టటం లేదు. ఒక్క మే నెలలోనే 15 సార్లు రేట్లను పెంచారు. ఇక తాజాగా ఇండియాలో లీటర్ పెట్రోల్ పై 26 పైసలు డీజిల్ పై 28 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్ 93 రూపాయల 94 పైసలకు చేరింది.

అలాగే డీజిల్ ధర 84 రూపాయలు 89 పైసలకు చేరింది. అయితే ఈ పదిహేను రోజుల్లోనే పెట్రోల్ పై మూడు రూపాయల యాభై నాలుగు పైసలు, డీజిల్ పై నాలుగు రూపాయల 16 పైసలు పెరిగాయి. ఇక తాజా రేట్ల పెంపుతో ముంబై లో అలాగే హైదరాబాదు లో పెట్రోల్ రేటు మరింత పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement