Thursday, May 2, 2024

Delhi: ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికీ రేవంత్‌ కృతజ్ఞతలు తెలిపారు.

కాసేపట్లో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై సోనియా, రాహుల్‌తో రేవంత్‌ చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement