Friday, April 19, 2024

Delhi | ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీలో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటీలో ఘనంగా గణతంత్ర దిన వేడుకలు జరిగాయి. బుధవారం ఐటీవో బ్రాంచ్‌లో ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ఉపాధ్యక్షులు ఎస్‌.ఎ. ఆలీషా, కో ఛైర్మన్ వి.వి రావు, పాఠశాల యాజమాన్య సభ్యులు శ్రీధర్, శ్రీనివాస్, విక్రమ్, ఉప ప్రధానోపాధ్యాయులు ఎస్. ఉపేందర్ జెండా వందనం చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్జ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.

బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఏఈఎస్ వైస్ ప్రెసిడెంట్ అలీషా విద్యార్థులకు వివరించారు. అనంతరం జరిగిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో గణతంత్ర వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో పెద్ సంఖ్యలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement