Wednesday, May 1, 2024

ఎమ్మార్పీ ధరకే రెమిడెసివిర్.. బారులు తీరిన జనం

సెకండ్ వేవ్‌లో కరోనా కోరలు చాస్తుండటంతో పాజిటివ్ బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోతుంది. కరోనా రోగులకు ఇంజెక్షన్ చేసే రెమిడెసివర్ మెడిసిన్ రోగులకు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హెటిరో డ్రగ్ కంపెనీ వారు హైదరాబాద్‌లోని మూసాపేట్ వై జంక్షన్ వద్ద గల గూడ్స్ స్టోరేజ్ బిల్డింగ్‌లో కంపెనీ రిప్రజంటేటివ్ నేతృత్వంలో సరాసరి కంపెనీ నుండి తీసుకువచ్చి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో ఓ స్టాల్ ఏర్పాటు చేసి ఎమ్మార్పీ ధరకే రెమిడెసివిర్ మెడిసన్ అమ్ముతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో రెమిడెసివర్ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో హెటిరో డ్రగ్ కోసం జనాలు అధిక సంఖ్యలో క్యూ కట్టారు. ఈ క్రమంలో అక్కడ కొంతసేపు తోపులాట జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement