Friday, May 3, 2024

ఎంసెట్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. గత ఆరేళ్లలో ఎన్నడూ రాని అప్లికేషన్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఎంసెట్‌-2023 ప్రవేశ పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. గత ఆరేళ్లలో ఎన్నడూ రానంతగా ఈసారి వచ్చాయి. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఇంజినీరింగ్‌ కోర్సులకు 1,95,515 దరఖాస్తులు వచ్చినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ డా. బి.దీన్‌ కుమార్‌ పేర్కొన్నారు. .

అగ్రికల్చర్‌, మెడికల్‌ కోర్సుల్లో 1,09,335 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కోర్సులకు కలిపి 335 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా ఎంసెట్‌కు 3,05,185 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఏపీ నుంచి టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ కోర్సులకు ఈసారి భారీగా దరఖాస్తులు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement