ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్కతా నైట్రైడర్స్ విజయం సాధించింది. వరుస ఓటములతో సతమతమౌతున్న ఆర్సీబీ.. కోల్కతా నిర్ధేశించిన 222 పరుగుల ఛేదనలో 221 పరుగుల చేసి కేవలం 1 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ గెలుపుతో కోల్కతా పాయింట్స్ టేబుల్లో రెండవ స్థానానికి చేరుకుంది.
ఆర్సీబీ బ్యాటర్లలో విల్ జాక్స్ (55), రజత్ పాటిదార్ (52) లు చెరో హాఫ్ సెంచరీలతో చెలరేగినప్పటికీ లాభం లేకుండా పోయింది.. సుయాష్ ప్రభుదేశాయ్ (24), దినేష్ కార్తీక్ (25), కర్ణ్ శర్మ (20) పరుగులతో పరువాలేదనిపించారు.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కోల్కతాకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 14 బంతుల్లోనే 48…. పరుగులు చేశాడు. కెప్టెన్ అయ్యర్ అర్థ సెంచరీతో రాణించాడు. సునీల్ నరైన్, రఘువంశి, వెంకటేశ్ అయ్యర్ నిరాశపరిచారు. చివర్లో రస్సెల్, రమన్ధీప్ సింగ్ విజృంభించడంతో కోల్కతా భారీ స్కోరు చేసింది.