Monday, April 29, 2024

ఈదురు గాలులతో పాటు.. రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు..

దేశంలోని అనేక ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని.. ఢిల్లీలో ఈదురు గాలులతోపాటు రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే చాన్స్​ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 19డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోతాయని, మంగళవారం నాటికి 8 డిగ్రీల కంటే తగ్గొచ్చని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. కాగా, బుధవారం ఉష్ణోగ్రతల తగ్గుదలతో పాటు.. ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement