Friday, May 17, 2024

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ : సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వికారాబాద్‌, గుంతకల్‌ మీదుగా సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌- తిరుపతి (రైల్‌ నెంబర్‌: 07120) ఆగస్టు 31న సాయంత్రం 6.15గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుపతి -సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07121) తిరుపతి నుంచి సెప్టెంబర్‌ 1న రాత్రి 9.10 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement