Friday, May 3, 2024

ఇంటర్‌ స్టేట్‌ అథ్లెటిక్స్​లో రైల్వే ఉద్యోగికి పతకం.. ట్రిపుల్ జంప్‌లో కాంస్యం కొట్టిన కార్తీక‌

అమరావతి, ఆంధ్రప్రభ: నేషనల్‌ ఇంటర్‌ స్టేట్‌ సీనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో విజయవాడ రైల్వే డివిజన్‌లో సీనియర్‌ కమర్షియల్‌ క్లర్క్‌గా పని చేస్తున్న జి. కార్తీక కాంస్య పతకాన్ని సాధించారు. ఈ నెల 10 నుంచి 14 వరకు చెన్నైలో ఈ పోటీలు జరిగాయి.

ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించిన కార్తీక ట్రిపుల్‌ జంప్‌లో 13.25 మీటర్లు దూకి కాంస్య పత కాన్ని పొందింది. ఈ సందర్భంగా డీఆర్‌ఎం శివేంద్ర మోహన్‌, ఏడీఆర్‌ఎంలు ఎం. శ్రీకాంత్‌, డి. శ్రీనివాసరావు, సీనియర్‌ డీసీఎం వి. రాంబాబు, డివిజినల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ వల్లిశ్వర. బి. తోకల ప్రత్యేకంగా కార్తీకను అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement