Sunday, April 28, 2024

Nyaya Yatra – అస్సాంలోకి రాహుల్​ భారత్​ జోడో న్యాయ్ యాత్ర ..

తులి – కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ గురువారం నాగాలాండ్‌ నుంచి శివసాగర్‌ జిల్లాలోని హలువాటింగ్‌ మీదుగా అస్సాంలోకి ప్రవేశించింది. రాహుల్​ గురువారం ఉదయం నాగాలాండ్‌లోని తులి నుండి బస్సులో తన ప్రయాణాన్ని పునఃప్రారంభించి, ఉదయం 9:45 గంటలకు అస్సాం చేరుకున్నారు. రాష్ట్రంలో ఎనిమిది రోజుల యాత్ర కోసం అస్సాం కాంగ్రెస్ నాయకులకు జాతీయ జెండాను అందచేశారు. హలువాటింగ్ వద్ద వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.

రాహుల్​ నేతృత్వంలోని 6,713 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమై మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. కాగా, అస్సాంలో ఈ పాదయాత్ర జనవరి 25 వరకు కొనసాగుతుంది. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలను కవర్ చేయడానికి ప్లాన్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement