Tuesday, April 30, 2024

ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ జెండా రంగులను మార్చాలి: రఘురామకృష్ణ రాజు మ‌రో లేఖ

ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు మ‌రో లేఖ రాశారు. ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ జెండా రంగులను తక్షణమే పాత రంగులలోకి మార్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జ‌గ‌న్ గారిని కోరుతున్నాను. అని లేఖలో ప్రస్తావించారు. మార్చడం ద్వారా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టవుతుంది’ అని ఆయ‌న పేర్కొన్నారు.అన్నీ తెలిసే ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని రఘురామకృష్ణ రాజు చెప్పారు. ‘అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చ‌స్తే, ఏమీ తెలియ‌నమ్మ ఏకాద‌శి నాడు చ‌చ్చింద‌ట’ అంటూ ఆయ‌న ఎద్దేవా చేశారు. ‘పేనుకు పెత్త‌నం ఇస్తే త‌ల అంతా గొరికి పెట్టింది అంట’ అన్న‌ట్లు తీరు ఉంద‌ని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీకి కాబోయే మహిళా ముఖ్యమంత్రి ఎవరు?: వంగలపూడి అనిత

Advertisement

తాజా వార్తలు

Advertisement