Saturday, April 27, 2024

Radisson Hotel Drugs Case: డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌

గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడు, వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారని తేల్చారు. తాజాగా ఈ డ్రగ్స్ తో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ లో క్రిష్ పేరును ఎనిమిదో నిందితుడిగా చేర్చారు. పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ రాడిసన్ హోటల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ జరుగుతున్న రూమ్ లో అరగంట పాటు కూర్చున్నారని, రాడిసన్ యజమాని వివేకానందతో ఆయన మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో ఉన్న నిందితులందరిని పిలిచి విచారిస్తామని పోలీసులు వెల్ల‌డించారు..

హోట‌ల్ కు వెళ్లా… క్రిష్ ..

ఇక ఈ కేసుపై డైరెక్టర్ క్రిష్ స్పందించాడు. తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని ఒప్పుకున్నాడు. సాయంత్రం ఒక అరగంట మాత్రం నేను అక్కడ ఉన్నాను అని, కేవలం ఫ్రెండ్స్ ను కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు తెలిపాడు. సాయంత్రం ఆరు గంటల 45నిమిషాలకు తాను హోటల్ నుంచి బయటకు వచ్చేసానని, హోటల్ యజమాని వివేకానందతో అప్పుడే పరిచయం ఏర్పడిందని తెలిపాడు. తన డ్రైవర్ లేకపోవడంతో వివేకానందతో అరగంట పాటు మాట్లాడానని, డ్రైవర్ రాగానే పార్టీ నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయం పోలీసులకు కూడా చెప్పాన‌న్నారు. దీనిపై వాళ్ళు కూడా తనను ఒక స్టేట్మెంట్ అడిగినట్లు తెలిపాడు. ఈ డ్రగ్స్ తో తనకేం సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఇకపోతే ప్రస్తుతం క్రిష్ ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement