ఆకలిని తీర్చుకొనేందుకు ఎంతపనైనా చేసుకొనేందుకు వెనుకాడరు. మనుషులతో పాటు జంతువులకు కూడ ఇది వర్తిస్తోంది. ఓ కొండ చిలువ తన ఆకలిని తీర్చుకొనేందుకు చేసిన ప్రయత్నం పలించకపోగా ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆకలి బాద మనుషులతో పాటు జంతువులకు కూడ ఇబ్బందిని కల్గిస్తోంది. కోతిని కొండచిలువ మింగిన ఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని గోదావరి తీరంలో గల పంట పోలాల వద్ద కొండచిలువ కోతిని మింగేసినట్లు రైతులు తెలిపారు. పొలాలకు వెళ్లిన రైతులకు ఓ చెట్టు వద్ద కోతుల మంద అరుపులు చేస్తూ కనిపించింది. దీంతో రైతులు వాటిని చెదరగొట్టే క్రమంలో అక్కడికి వెళ్లిన పలువురు రైతులకు కోతిని మింగితున్న కొండ చిలువ కనిపించింది. దీంతో రైతులు స్థానికులకు సమాచారం అందించడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద కోతిని మింగడంతో ఊపిరాడక కొండచిలువ అక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement