Tuesday, April 30, 2024

పీవీ సింధుకి కొత్త కోచ్ .. ఒలింపిక్స్ వ‌ర‌కు మాజీ చాంపియ‌న్‌ హ‌ఫీజ్ నియామ‌కం

భారత స్టార్ అథ్లెట్ పీవీ సింధు కొత్త కోచ్‌గా ఆల్ ఇంగ్లండ్ మాజీ ఛాంపియన్ మలేషియాకు చెందిన మహ్మద్ హఫీజ్ హషీమ్ నియమితులయ్యారు. పీవీ సింధుకు వచ్చే పారిస్ ఒలింపిక్స్ వరకు మహ్మద్ హఫీజ్ హషీమ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అనుమతులు వచ్చాయి. సింధు కోచ్‌గా హషీమ్‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించింది. తద్వారా మలేషియాకు చెందిన ముహమ్మద్ హఫీజ్ రాబోయే టోర్నీల్లో పీవీ సింధుకు మార్గనిర్దేశం చేయనున్న‌ట్టు తెలుస్తోంది. ఈ వారం కొరియా ఓపెన్‌లో ఆడుతున్న సింధును కలిసేందుకు హషీమ్ న్యూఢిల్లీ నుంచి వెళ్లిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement