Wednesday, May 1, 2024

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నుంచి పీవీ సింధూ దూరం

సీజన్‌ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నుంచి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధూ తప్పుకుంది. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింధు తండ్రి పివి రమణ వెల్లడించారు. వచ్చే నెల 14 నుంచి చైనా వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుంది. 2018 టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన సింధు పోటీ నుంచి తప్పుకోగా ఇక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ భారత్‌ నుంచి హెచ్‌ ఎస్‌ ప్రణయ్‌ ఒక్కడే బరిలోకి దిగనున్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement