Saturday, July 27, 2024

Puri – జగన్నాథుడి చందన ఉత్సవంలో అపశ్రుతి – పటాసులు పేలుడులో ఒకరి మృతి

ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ జరిగిన బాణసంచా పేలుడులో ఒకరు మృతిచెందారు. మరో 15 మంది భక్తులకు గాయాలయ్యాయి..

బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వందలాది మంది తరలివచ్చారు. ఈ క్రమంలో కొంతమంది భక్తులు పటాకులు పేల్చడంతో ఆ నిప్పురవ్వలు సమీపంలో బాణసంచా నిల్వ ఉంచిన చోట పడ్డాయి.

- Advertisement -

దీంతో పెద్దఎత్తున పేలుడు సంభవించి ఒకరు మృతిచెందగా.. పలువురు భక్తులు గాయపడ్డారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకునేందుకు పుష్కరిణిలోకి దూకినట్లు అనుమానిస్తున్నారు. గురువారం ఉదయం అండర్‌ వాటర్‌ సెర్చింగ్‌ కెమెరాలతో గాలింపు చేపట్టారు. క్షతగాత్రులను పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అందుకయ్యే ఖర్చును సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి భరించనున్నట్లు ప్రకటించారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement