Thursday, May 2, 2024

రామగిరి కోటను పరిరక్షించండి.. కాళేశ్వరం ఆలయాన్ని అభివృద్ది చేయండి : శ్రీధర్‌బాబు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మంథని నియోజకవర్గంలోని పురాతన రామగిరి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆయన రామగిరి కోటను పరిరక్షించాలంటూ వినతిపత్రం సమర్పించారు.

12వ శతాబ్దానికి చెందిన కోటకు సరైన రహదారి, ఇతర మౌలిక వసతులను కల్పించాలని కోరారు. రామగిరి కోట సాంస్కృతిక వారసత్వం, ఔషధ మొక్కల కేంద్రంగా ఉందని కేంద్రమంత్రికి శ్రీధర్‌బాబు వివరించారు. అలాగే కాళేశ్వరం ఆలయానికి కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కిషన్‌రెడ్డికి వినతి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement