Sunday, April 28, 2024

16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం..

కేంద్రం మ‌రోసారి ప్రాస్టిక్ నిషేధం పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దాదాపు 16 ర‌కాల ప్లాస్టిక్‌ వ‌స్తుల‌ను నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో ఇయర్ బడ్స్, బెలూన్లు, క్యాండీ, ఐస్‌క్రీం కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్‌బాక్స్‌లు, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్‌లలోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే పాలిస్ట్రైరిన్ (థర్మాకోల్) వంటి 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. జులై 1 నుంచే నిషేధం అమల్లోకి వస్తుందని పేర్కొంది. వాణిజ్య సంస్థలేవీ తమ పరిధిలో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను ఉపయోగించరాదంటూ స్థానిక సంస్థలు లైసెన్సులు జారీ చేయాలని, దీనిని ఉల్లంఘించి నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించినా, విక్రయించినా వాటి లైసెన్సు రద్దు చేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్టు అటవీ మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement