Saturday, May 18, 2024

హ‌మాస్ ఉగ్ర దాడి ప‌ట్ల ప్ర‌ధాని మోడీ దిగ్భాంతి – ఇజ్రాయేల్ కు అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌ట‌న ….

న్యూ ఢిల్లీ – ఇజ్రాయెల్ లో పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ జరిపిన రాకెట్ దాడులుతీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు ప్రధాని మోడీ. ఈ ఉగ్రదాడుల్లో బలైన అమాయకుల కుటుంబాలకు, బాధితులకు సానుభూతి తెలుపుతున్నాం అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటిస్తున్నామని వెల్ల‌డించారు. ఈ మేర‌కు రు. ఈ మేరకు ఎక్స్ లో ట్విట్ చేశారు.

కాగా, కొంతకాలంగా ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అయితే హమాస్ సంస్థ ఈ ఉదయం నుంచి ఇజ్రాయెల్ పై రాకెట్లతో విరుచుకుపడడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. ఇజ్రాయెల్ దక్షిణ భాగంలోని సీడెరట్ నగరంలో హమాస్ మిలిటెంట్లు కాల్పులు జరపగా, భారీగా ప్రాణనష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ భీకరస్థాయిలో ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పాలస్తీనాలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించాయి.

ఇజ్రాయెల్ ఇవాళ్టి దాడులను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో, మధ్యప్రాచ్యంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇక, హమాస్ రాకెట్ దాడులతో పెద్ద తప్పు చేసిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గలాంట్ అన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తప్పక విజయం సాధిస్తుందని ప్ర‌ధాని నెత‌న్యాహు ప్ర‌క‌టించారు.. త‌మపై జ‌రిపిన దాడికి ప్ర‌తికారం తీవ్రంగా ఉంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement