Wednesday, May 1, 2024

JDS Chief: దేశ ప్ర‌గ‌తికి ప్ర‌ధాని కృషి ఎన‌లేనిది.. మాజీ ప్ర‌ధాని దేవగౌడ‌

దేశ ప్ర‌గ‌తికి ప్ర‌ధాని మోడీ చేస్తున్న కృషి ఎన‌లేనిదని మాజీ ప్ర‌ధాని దేవగౌడ కొనియాడారు. ఇటీవలే ఎన్డీఏ కూటమితో జేడీఎస్‌ పొత్తుపెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జేడీఎస్‌ అధినేత ,మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ కలిశారు.

ఇద్దరు కుమారులు కుమార స్వామి , రేవణ్ణ తో కలిసి ఢిల్లీలో మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ విషయాన్ని ప్రధాని మోదీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా తెలియజేశారు. ఈ మేరకు భేటీకి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. వారిని కలవడం ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుందంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement