Monday, April 29, 2024

National : ఇవాళ కల్కిధామ్ ఆలయానికి ప్రధాని శంకుస్థాప‌న‌

ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జిల్లాలో కల్కిధామ్ ఆలయానికి ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆచార్య ప్రమోద్ కృష్ణం ప్రధానిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఆలయ శంకుస్థాపన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. యూపీ అంతటా రూ. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆచార్య ప్రమోద్ కృష్ణం మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఇశ్రీకల్కి ధామ్ శంకుస్థాపనకు రావడం మాకు గర్వకారణమని అన్నారు. ఈ ఉదయం మోదీ సంభాల్‌కు చేరుకుంటారని, ఆ తర్వాత ఆలయ గర్భగుడిలో ప్రధాన రాయిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వెళతారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కల్కీ ధామ్ గురువులు, మతపెద్దలు, ప్రముఖులు, భక్తులు హాజరవుతున్నారు. ప్రముఖ కవి కుమార్ విశ్వాస్, క్రికెటర్లు మహమ్మద్ షమీ, సురేశ్ రైనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement