Saturday, May 11, 2024

అధికారం అంటే అహంకారం కాదు..ప్ర‌జ‌ల‌పై మ‌మ‌కారం – సీఎం జ‌గ‌న్

అట్ట‌హాసంగా వైసీపీపీ ప్లీన‌రీ ప్రారంభ‌మ‌యింది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ..13ఏళ్ల కింద‌ట సంఘ‌ర్ష‌ణ మొద‌ల‌యింద‌న్నారు. ఎన్నో వ్య‌వ‌స్థ‌లు క‌త్తి గ‌ట్టినా..ఎంతో మంది కుట్ర‌లు ప‌న్నినా నా గుండె బెద‌ర‌లేదు..నా సంక‌ల్పం చెద‌ర‌లేద‌న్నారు. ఈ జ‌గ‌మంత కుటుంబం ఏనాడు నా చేయి వీడ‌లేద‌న్నారు జ‌గ‌న్.. అవ‌మానాల్ని..క‌ష్టాల్ని భ‌రించి నాతో ప్ర‌యాణించి వెన్నుద‌న్నుగా ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ సెల్యూట్ అన్నారు.

గుంటూరు కాజాలో వైసీపీ ప్లీన‌రీ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఈకార్య‌క్ర‌మానికి త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మితో క‌లిసి హాజ‌రైయ్యారు సీఎం జ‌గ‌న్.ఈ మేర‌కు వైసీపీ జెండాను ఆవిష్క‌రించారు వైఎస్ జ‌గ‌న్. అధికారం అంటే అహంకారం కాదు..ప్ర‌జ‌ల‌పై మ‌మ‌కారం అన్నారు. చ‌రిత్ర‌లో జ‌ర‌గ‌ని విధంగా న‌న్ను ఆశీర్వ‌దించార‌న్నారు. ఓదార్పు యాత్ర‌తో పార్టీ ఒక రూపం దాల్చుకుంద‌న్నారు.151ఎమ్మెల్యే స్థానాల‌తో ప్ర‌జ‌లు మ‌న‌కు అధికారం ఇచ్చార‌న్నారు. వైఎస్సార్ ఆశ‌యాల సాధ‌న‌కోసం వైసీపీ ఆవిర్భావించిద‌న్నారు జ‌గ‌న్. కోట్లాది మంది అభిమానులు..ప్ర‌జ‌ల‌కు సెల్యూట్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement