Sunday, April 28, 2024

జేఎన్‌టీయూ పార్ట్‌ టైం పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష వాయిదా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జేఎన్టీయూహెచ్‌లో ఫుల్‌ టైం, పార్ట్‌ టైం పీహెచ్‌డీలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. ఈమేరకు యూనివర్సిటీ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు.

ఈనెలలోనే ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది, అయితే గ్రూప్‌-2 పరీక్షలు కూడా ఇదే నెలలో (29, 30న) జరుగుతున్న నేపథ్యంలో పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అధికారులు నిర్ణయించారు. ఈక్రమంలోనే పార్ట్‌ టైం పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్‌ 14 నుంచి 16 వరకు నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement