Sunday, May 5, 2024

Political Movie – జ‌గ‌న్ బ‌యోపిక్ గా యాత్ర 2 మూవీ… ఫ‌స్ట్ లుక్ రిలీజ్

ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి స్టోరీ నేపథ్యంలో వచ్చిన బయోపిక్ మూవీ యాత్ర . మహి వి రాఘవ్ దర్శకుడు.. ఈ చిత్రానికి కొనసాగింపుగా యాత్ర 2 త్వరలో రిలీజ్ కానుంది.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమా సీక్వెల్ తెర‌కెక్కుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పాత్ర‌లో కోలీవుడ్ యాక్ట‌ర్ జీవా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేశారు.

ఇక ఈ ఫ‌స్ట్ లుక్‌లో ఒక‌వైపు జీవా ఉండ‌గా.. మ‌రోవైపు మమ్ముట్టి ఉన్నాడు. ఈ పోస్ట‌ర్‌లో ”నేనెవ‌రో ఈ ప్ర‌పంచానికి ఇంకా తెలియ‌కపోవ‌చ్చు. కానీ ఒక్క‌టి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్‌రెడ్డి కొడుకుని” అంటూ పోస్ట‌ర్‌లో రాసుకోచ్చారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి 08న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement