Friday, May 10, 2024

Ratan Tata: రతన్ టాటాను బెదిరించిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు

ముంబై: వ్యాపారవేత్త రతన్ టాటాను బెదిరించిన వ్యక్తి ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఎంబీఏ చదువుకున్న వ్యక్తి బెదిరింపు కాల్ చేసిన‌ట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ వ్యక్తికి సిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వివరాళ్లోకి వెళ్తే.. రతన్ టాటాకు సెక్యూర్టీని పెంచాలని ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేశాడు. సెక్యూరిటీ పెంచని పక్షంలో.. టాటా సన్స్ మాజీ చైర్మెన్ సైరస్ మిస్త్రీ తరహాలో రతన్ టాటాకు ప్రమాదం జరిగే అవకాశమున్నట్లు ఆ వ్యక్తి ఫోన్‌లో బెదిరించాడు. ఆ ఫోన్ కాల్‌తో ముంబై పోలీసులు అలర్ట్ మోడ్‌లోకి వెళ్లారు. రతన్ టాటాకు ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. టెక్నికల్ సపోర్ట్ బృందం ద్వారా ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఆధారాలను సేకరించారు. ఆ వ్యక్తి కర్నాటకలో ఉన్నట్లు గుర్తించారు. అయితే అతను పుణెకు చెందిన వ్యక్తి అని తేల్చారు. పుణెలో అతని ఇంటికి వెళ్లిన పోలీసులు.. అతను 5 రోజుల నుంచి మిస్సింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. బోసారి పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement