Monday, April 29, 2024

కలకలం రేపిన కానిస్టేబుల్ ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సైదులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తిరుమలదేవుని గుట్టపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. కానిస్టేబుల్ యూనిఫారంలోనే ఆత్మహత్యకు పాల్పడడంతో బ్యాడ్జి నంబర్ ఆధారంగా మర్రిగూడ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. 

అయితే సైదులు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 2018 బ్యాచ్‌కు చెందిన సైదులు స్వగ్రామం నల్గొండ జిల్లా డిండి మండలం ఖానాపూర్. మృతుడికి ఇటీవలే వివాహమైంది. ప్రస్తుతం అతడి భార్య ప్రెగ్నెంట్ అని సమాచారం. కాగా సైదులు ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement