Saturday, April 27, 2024

గుంటూరు: యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి

తాడేపల్లి సీతానగరం వద్ద ప్రేమజంటపై దాడి చేసి యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులు తాడేపల్లి పట్టణం సీతానగరంకు చెందిన కృష్ణ, వెంకటేష్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కర ఘాట్లలో ఒంటరిగా ఉన్న వారిపై గతంలో కూడా దాడులు చేసి దోచుకున్నారని, వారు దోచుకున్న సొమ్ముతో గంజాయి తాగి అఘాయిత్యాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే నిందితులను అర్ధరాత్రి తిరుగుతుంటే ప్రత్యేక బృందం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు నిందితులను బాధితురాలు గుర్తించినట్లు సమాచారం. నిందితులు దాస్ అనే వ్యక్తి దగ్గర ఫోన్లు తాకట్టు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement