Monday, May 6, 2024

PM MODI: నా మిత్రుడు విజ‌యకాంత్ మ‌ర‌ణం క‌దిలించివేసింది

న్యూఢిల్లీ – ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. తమిళ చలనచిత్ర ప్రపంచంలో విజయకాంత్ ఒక లెజెండ్ అని త‌న సంతాప సందేశంలో పేర్కొన్నారు.

ఆయన విలక్షణమైన ప్రదర్శనలు కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టరని అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజా సేవకు కట్టుబడి ఉన్నారని, తమిళనాడు రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తనకు విజయకాంత్ సన్నిహిత మిత్రుడని, ఆయనతో తనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నానని చెప్పారు. ఈ విషాదకర సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. విజయకాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని మోడీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement