Wednesday, May 15, 2024

తెలంగాణ‌లోని అన్నీ వ‌ర్సిటీల్లో 27 నుంచి మొద‌టి సంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు..

తెలంగాణలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు 27 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ఒకే రోజు నుంచి మొదటి సంవత్సరం తరగతులు మొదలు కానున్నాయి. ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఉమ్మడి క్యాలెండర్‌ అమలుపై ఓయూ, కేయూ, పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన వర్సిటీల వీసీలతో ఇటీవలే కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ఈనెల 27 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement