Friday, May 10, 2024

మ‌రోసారి ముర‌ళీధ‌ర‌న్ ని క‌లిసిన.. ప‌వ‌న్ క‌ల్యాణ్

మ‌రోసారి బిజెపి ఏపీ ఇంచార్జి ముర‌ళీధ‌ర‌న్ ని క‌లిశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు. నిన్నటి నుండి ఢిల్లీ లోని బీజేపీ అధిష్టానం లోని కీలక నాయకులను కలుస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఈ మధ్యన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి .. కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ ఢిల్లీ పెద్దలకు వివరిస్తున్నారు. కాగా నిన్న బీజేపీ ఏపీ ఇంచార్జి మురళీధరన్ ను కలిసిన సంగతి తెలిసిందే. కాగా మంగ‌ళ‌వారం రెండవసారి ఆయనను కలిసి వివిధ రాజకీయ అంశాల గురించి చర్చిస్తున్నారట. ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా బీజేపీ జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ , జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ లు పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ జేపీ నడ్డా .. హోమ్ మినిస్టర్ అమిత్ షా లను కలుసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement