Thursday, May 2, 2024

Paper less budget – తొలిసారి పేప‌ర్ లెస్ బ‌డ్జెట్ ….నిర్మల అరుదైన ఘ‌న‌త

సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ సర్కార్‌ గురువారం చివరి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో చదివి వినిపించారు. ఉదయం 11 గంటలకు తన బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. 12 గంటలకు ప్రసంగాన్ని ముగించారు. దాదాపు గంటపాటు ఈ ప్రసంగం సాగింది. నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం అనంతరం లోక్‌సభ శుక్ర‌వారానికి వాయిదా పడింది.

రికార్డుల బడ్జెట్.. పేపర్ లెస్ విధానం.. ట్యాబ్లో చూస్తూ బడ్జెట్ ప్రసంగం

భారత బడ్జెట్ చరిత్రలో సరికొత్త విధానం కనిపించింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఈసారి చర్చనీయాంశం అయ్యింది. టాబ్లో చూస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు ఆర్థిక మంత్రి నిర్మలా.

నిర్మలమ్మ అరుదైన ఘనత.. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డు సమం
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత అందుకున్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. ఈ క్రమంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు. 2019 జులై నుంచి ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో ఆమె వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన గత ఆర్థిక మంత్రులు మన్మోహన్‌సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను అధిగమించారు. ఇక మొరార్జీ దేశాయ్ 1959-64 మధ్య ఆర్థికమంత్రిగా వరుసగా ఐదుసార్లు వార్షిక బడ్జెట్, ఒకసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement