Tuesday, March 19, 2024

రీ రిలీజ్ కానున్న ఆరెంజ్.. జ‌న‌సేన‌కి విరాళంగా క‌లెక్ష‌న్స్

ఈ మ‌ధ్య కాలంలో పాత సినిమాలు మ‌ళ్లీ రీ రిలీజ్ అవుతున్నాయి. ఇదొక ట్రెండ్ గా మారింది. కాగా ఆరెంజ్ చిత్రం కూడా రీ రిలీజ్ కానుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, జెనీలియాలతో ‘ఆరెంజ్’ చిత్రాన్ని నిర్మించారు సినీ నటుడు, నిర్మాత, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు. ఈ క్లాసికల్ ప్రేమ కథా చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి నెల 25, 26 తేదీల్లో మళ్లీ విడుదల చేస్తున్నామని… ఆ సినిమా ద్వారా రాబోయే ప్రతి రూపాయిని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. మెగా అభిమానులు, జనసైనికులు తమ వంతుగా ఈ కార్యక్రమంలో భాగం అయి, వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నానని చెప్పారు. వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆశిస్తున్నానని తెలిపారు.మ‌రి ఆరెంజ్ ని ప్రేక్ష‌కులు ఏ మేర‌కు ఆద‌రిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement