Tuesday, April 30, 2024

నిరుద్యోగులకు శుభవార్త… రేపు ఆన్‌లైన్‌లో జాబ్ మేళా

రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఫ్రైవేట్‌ సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 13న ఉదయం 11:30 గంటలకు ఆన్‌లైన్‌ జూమ్‌ యాప్‌ ద్వారా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి జయశ్రీ బుధవారం ప్రకటించారు. అర్హత ఆసక్తి గల నిరుద్యోగ యువకులు www.ncs.gov.in పోర్టల్‌లో రిజిస్టర్‌ వేసుకొని ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. కంపెనీ HP ప్రతినిధులచే ఆన్‌లైన్‌ వెబినార్‌ ద్వారా ప్రాథమికంగా ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.

ప్రాథమిక ఇంటర్వ్యులో ఎంపికైన వారికి ఫైనల్‌ ఇంటర్వ్యూ వివరాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 18-35 సంవత్సరాల లోపు వయసు గల యువకులు విద్యార్హత 10వ తరగతి ఉండాలన్నారు. వేతనం రూ. 10వేల నుంచి రూ. 18వేల వరకు ఉంటుందని, వివిధ సంస్థల్లో పని చేసేందుకు 120పైగా ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థుల బయోడేటా లేదా రెస్యూమ్‌ను [email protected]కు పంపాలన్నారు. వివరాలకు 8247656356 నంబరులో రఘుపతిని సంప్రదించాలని సూచించారు.

ఈ వార్త కూడా చదవండి: సైక్లింగ్ చేయండి.. దీర్ఘాయువు సొంతం చేసుకోండి

Advertisement

తాజా వార్తలు

Advertisement