Saturday, May 18, 2024

ఫ్లై ఓవర్‌పై బైక్ ను ఢీకొట్టిన కారు.. బ్రిడ్జిపై నుంచి పడి ఒకరు మృతి

హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన షేక్‌పేట ఫ్లై ఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫై ఓవర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు..​ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి ప్లై ఓవర్‌ పై నుండి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement