Thursday, May 2, 2024

ఓంకారేశ్వ‌ర ఆల‌యంలో – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రత్యేక పూజ‌లు

యాచారం, (ప్రభన్యూస్): మండల పరిధిలోని నంది వనపర్తి గ్రామంలోని ఓంకారేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా తెరాస అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. అక్కడి నుండి నజ్జిక్ సింగారం గ్రామానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సభలో.. దేవాలయాల అభివృద్ధి పై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యం.పి.పి కొప్పు సుకన్య భాషా, జడ్పీటిసి చిన్నొల్ల జంగమ్మ యాదయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకట్ రమణ రెడ్డి, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement