Friday, April 26, 2024

సినారె పురస్కారానికి ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్‌ ఎంపిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ ఏడాది ఒడియా రచయిత్రి డాక్టర్‌ ప్రతిభా రాయ్‌ ఎంపికయ్యారు. ఈనెల 29న హైదరాబాద్‌లో జరగనున్న సి. నారాయణ రెడ్డి 91వ జయంతి ఉత్సవాల్లో ఈ పురస్కారాన్ని ఆమెకు సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు అందజేయనుంది.

ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పాల్గొని పురస్కార గ్రహీత ప్రతిభా రాయ్‌కు ఐదు లక్షల నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రాన్ని అందజేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement