Wednesday, May 1, 2024

Father killed son: అశ్లీల వీడియోలు విద్యార్థినీలకు చూపిస్తూ అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌… కుమారుడిని చంపిన తండ్రి

పాఠ‌శాల‌కు వెళ్లి చ‌దువుకోవాల్సిన వ‌య‌సులో త‌ప్ప‌ట‌డుగులు వేశాడు ఓ విద్యార్థి. త‌న తోటి విద్యార్థినుల‌తో గౌర‌వంగా ఉండాల్సింది పోయి అస‌భ్యక‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న చ‌ర‌వాణిలో అశ్లీల వీడియోలు చూడ‌డ‌మే కాకుండా తోటి విద్యార్థినుల‌నుప‌క్క‌న కూర్చోబెట్టుకొని చూపిస్తూ హేయమైన చ‌ర్య‌లకు దిగాడు. దీంతో ఆ విద్యార్థినులు విష‌యాన్ని పాఠ‌శాల యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేశారు. వెంట‌నే పాఠ‌శాల యాజ‌మాన్యం త‌ల్లిదండ్రుల‌కు ఫిర్యాదు చేశారు. విష‌యం తెలుసుకున్న తండ్రి ఆగ్ర‌హావేశంతో కుమారుడిని మ‌ట్టుబెట్టాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. తమ కుమారుడు కనిపించడం లేదంటూ గత నెల 13న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కాసేపటికే కుర్రాడి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నివేదికలో విషం తీసుకోవడం వల్లే మరణించినట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వారి సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో అనుమానించారు. కుర్రాడి తండ్రిని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

విశాల్ చదువును పక్కనపెట్టేసి ఫోన్లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్లో అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పద్ధతి మార్చుకోమని చెప్పినా పెడచెవిన పెట్టాడు. మరోవైపు స్కూలు నుంచి కూడా ఫిర్యాదులు పెరిగాయి. కుమారుడి ప్రవర్తనపై విసిగిపోయిన తండ్రి జనవరి 13న తన 14 ఏళ్ల కుమారుడు విశాల్ను బైక్​ పై తుల్జాపూర్ రోడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ కూల్డ్రింక్ కొని అందులో విషం కలిపి కుమారుడికి ఇచ్చాడు. విశాల్ అపస్మారక స్థితికి చేరుకున్నాక అతడు తిరిగి ఒంటరిగా ఇంటికి చేరుకున్నాడు. అదే రోజు సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరూ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు నిందితుడు తండ్రేనని తేలడంతో తాజాగా అతడిని కటకటాల వెనక్కి పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement