Saturday, May 4, 2024

Prakasam: పెళ్లి చేయలేదని.. తండ్రిని హతమార్చిన కొడుకు

ప్రకాశం: పెళ్లి చేయలేదని ఓ కొడుకు తండ్రిని హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం కనకదుర్గమ్మ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేయలేదనే నెపంతో తండ్రిని కుమారుడు హత్య చేశాడు. ఇవాళ తెల్లవారుజామున తండ్రి బాలభద్రాచారిని ఇంటి నుంచి బయటకి తీసుకెళ్లిన కుమారుడు గురునారాయణ పథకం ప్రకారం హతమార్చాడు.

తొలుత తన వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్వల్ప గాయాలైన గురునారాయణను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ వీరారాఘవరెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement