Monday, May 6, 2024

New Friendship – మాల్దీవుల్లో లంగరేసిన చైనా…

మాల్దీవులకు చైనా పరిశోధనా నౌక వెళ్తోందని భారత సైనిక అధికారి.. స్వతంత్ర పరిశోధకుడిని ఉటంకిస్తూ వెల్లడించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఈ మధ్య చైనాలో పర్యటించారు. దీంతో ఆ రెండు దేశాల సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 14న భారతదేశం, మాల్దీవుల నుండి సైనిక సిబ్బంది ఉపసంహరణను వేగవంతం చేయడానికి ఒప్పందం జరిగింది.

జనవరి 14న భారత్, మాల్దీవులు కోర్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో మానవతా, మెద్వెక్ సేవలను అందించే భారతీయ విమానయాన ప్లాట్‌ఫారమ్‌ల నిరంతర కార్యాచరణను నిర్ధారించడానికి పరస్పర పని చేయగల పరిష్కారాన్ని కనుగొనడంపై ఇరుపక్షాలు చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తదుపరి సమావేశం దేశ రాజధానిలో జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ (MEA) ప్రకటించింది. కోర్ గ్రూప్ సమావేశంలో రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన అనేక అంశాలపై చర్చించాయి అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ జనవరి 18 న జరిగిన చర్చల వివరాలను వెల్లడించారు.

చైనాతో వ్యవసాయాభివృద్ధిపై ఒప్పందం..
కాగా, ఈ మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు.. ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ చైనా పర్యటన కోసం వెళ్లారు. మాలీలోని ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ వృద్ధిని విస్తరించడంలో మాల్దీవులకు సహాయపడే ఒప్పందాలు చైనా ప్రభుత్వంతో పలు సంతకం చేశాయని ముయిజ్జూ తెలిపారు. చైనాలో ముయిజ్జూ పర్యటన సందర్భంగా చైనా, మాల్దీవుల మధ్య అధికారిక చర్చల తరువాత ఈ ఒప్పందాలు జరిగాయి. సంతకాల కార్యక్రమంలో ఇరు దేశాలు 20 కీలక ఒప్పందాలను మార్చుకున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలపై ముయిజ్జూ మాట్లాడుతూ.. ఉతురు తిలా ఫల్హు (UTF)లో ఒక నిర్దిష్ట వ్యవసాయ పథకాన్ని ప్రారంభించడానికి చర్చలు జరిగాయని చెప్పారు. అతను ఊహించిన ప్రాజెక్ట్ కనీసం లక్షలాది మంది జనాభాకు సరిపోయే వ్యవసాయ వస్తువుల సాగుకు హామీ ఇస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement