Tuesday, April 30, 2024

New Committee – టి ఎస్ పి ఎస్ సి ఛైర్మ‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌హేంద‌ర్ రెడ్డి

హైదరాబాద్ – తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అనితారాజేంద్రతో మహేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. రెండురోజుల కిందట టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్తగా చైర్మన్‌ నియమితులైన మహేందర్‌రెడ్డి ఆ పదవిలో 11 నెలల పాటు కొనసాగనున్నారు. కాగా,నేడు కార్యాల‌యంలో జ‌రిగిన రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌లో మ‌హేంద‌ర్ రెడ్డి జాతీయ ప‌త‌కాన్ని ఆవిష్క‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement