Wednesday, May 1, 2024

అమానుషం: చెట్ల పొదల్లో పసికందు

నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలం పల్సి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ పసికందును చెట్ల పొదల్లో పడేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ మహిళకు చెట్ల పొదల నుంచి ఆడ శిశువు ఏడుపు వినిపించడంతో..ఆ మహిళ గ్రామస్థులకు విషయం చెప్పింది. దీంతో ఆ గ్రామ పెద్దలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందును బయటికి తీయించి ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement