Friday, April 26, 2024

నెట్ బేస్ క్విడ్ సంస్థ‌ సర్వే.. నెంబ‌ర్ వ‌న్ గా ఎన్టీఆర్

సోషల్ మీడియాను విశ్లేషించే ‘నెట్ బేస్ క్విడ్’ సంస్థ.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆస్కార్ వేడుకల సందర్భంగా సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. రెండో స్థానంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నట్లు వెల్లడించింది. వారిద్దరి తర్వాతి స్థానాల్లో ‘ఎవ్రీథింగ్’ సినిమాతో ఉత్తమ సహనటుడిగా అవార్డు అందుకున్న కె.హుయ్ ఖ్యాన్, ‘ది వేల్’తో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న బ్రెండన్ ఫ్రేజర్, అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్ ఉన్నట్లు చెప్పింది.అలాగే మీడియాలో అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగా కూడా ఆర్ఆర్ఆర్ నిలవడం గమనార్హం. తర్వాతి స్థానాల్లో ఎలిఫెంట్ విస్పరర్స్, ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్ తదితర సినిమాలు ఉన్నాయి. ఇక నటీమణుల విషయానికి వస్తే తొలి స్థానంలో మిషెల్ యో ఉన్నారు. లేడీ గాగా, ఏంజిలా బస్సెట్, ఎలిజిబెత్ ఓల్సెన్, జైమి లీ కర్టిస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement