Friday, May 3, 2024

National – ఆ గ్రామం ఐఏఎస్‌, ఐపిఎస్ ల కార్ఖానా

ఉత్త‌ర ప్ర‌దేశ్ – ఆ ఊరి నీటిలో, గాలిలో ఏమయినా మాయాజాలం ఉందా.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు. అవును ఈ ఊరు ఒక గ్రామం కాదు ఐఏఎస్ ల ఉత్పత్తి కేంద్రం.. ప్రతి ఇంట్లో ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ లు ఉంటారు.. కాబట్టి దీనిని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. అందుకే దేశం లోని ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


ఉత్తర ప్రదేశ్‌ లోని జౌన్‌పూర్ జిల్లా లోని మాధోపట్టి అనే గ్రామం ఇప్పటివరకు దాదాపు 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేసింది. యూపీ రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నఈ మాధోపట్టి గ్రామం దేశానికి అత్యధిక ఐఏఎస్, ఐపీఎస్ లను అందించింది. దీంతో, భారత దేశంలో సివిల్ సర్వీసెస్‌లో అత్యధిక అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచింది.

ఈ గ్రామం ‘IAS ఫ్యాక్టరీ’ గా పేరు పొందింది. ప్రతి యేటా ఉన్నత అధికారులను ఉత్పత్తి చేస్తూనే ఉంది. జౌన్‌పూర్ జిల్లా లోని ఈ గ్రామానికి కోచింగ్ సెంటర్‌లు లేవు. కాబట్టి, ఈ ఘనత మరింత మెచ్చుకోదగినది..! ఇక, స్థానిక పండుగల సమయంలో ఈ ఊరికి వచ్చే రోడ్లన్నీ ఎరుపు,నీలం లైట్లు వచ్చే కార్లతో రద్దీగా మారుతుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement